Tuesday, August 18, 2020

కరోనా కేసులు పెరుగుతుంటే విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు - ఆదర్శ వర్ధన్ రాజు - NSUI జిల్లా అధ్యక్షుడు

కరోనా కేసులు  పెరుగుతుంటే విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు - ఆదర్శ వర్ధన్ రాజు - NSUI జిల్లా అధ్యక్షుడు

రాస్తారోకో చేస్తున్న నాయకులు

 ఈ రోజు NSUI మాంచెరిల్ జిల్లా  ఆధ్వర్యంలో బెల్లంపల్లి బజార్ ఏరియా లో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడవద్దని  పరీక్షల షెడ్యుల్ విడుదల నిరసిస్తూ NSUI రాష్ట్ర అధ్యక్షులు బలమురి వెంకట తో పాటు  30 మంది విద్యార్థి నాయకులు ప్రగతి భవన్ ని ముట్టడించారు  ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు అయినా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది  కాబట్టి దీనికి నిరసనగా మాంచెరిల్  NSUI జిల్లా అధ్యక్షుడు ఆదర్శ వర్ధన్ రాజు  ఆధ్వర్యంలో బజార్ ఏరియా ప్రధాన రహదారి పైనా రాస్తా రోకో  చేయడం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనగందుల వెంకటేష్ మరియు చాకెపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా పరిస్థులులో రాష్ట్ర వ్యాప్తంగా కోవిద్ నిబంధనలు అమలులో ఉంటే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనుకోవడం ఎమాత్రం సమంజసం కాదని,  హైకోర్టు లో కేసు ఉన్న ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రం లో 30లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వంటనే పరీక్షలు నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు సాయికుమార్ , ప్రదీప్,  ఫారూఖ్, అస్లాం,వైభవ్, నాని  యువజన నాయకులు చంద్పాషా  మహేష్,  రవి, జంబోజు రాజకుమార్, పొల్లంపల్లి రాజుకుమార్ తదితరులు పాలుగోన్నారు. 

Tuesday, August 4, 2020

బెల్లంపల్లి మున్సిపల్ కో - ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం ..

బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో  బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య  ముఖ్య అతిథిగా బెల్లంపల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక.
కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన TRS పార్టీ కో ఆప్షన్ అభ్యర్థులు ఏలూరి వెంకటేష్ , ముచ్చర్ల భాగ్యలక్ష్మి , వాజిద్ , జంగిల్ మేరీ సుశీల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులతో సమన్వయంతో ఉంటూ బెల్లంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ గారు, వైస్ చైర్మన్ సుదర్శన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు ...





Saturday, August 1, 2020

ఓ యదార్థ గాధ





సంఘటన జరిగిన గ్రామం : చిన్నుగుాడ, కెరిమెరి గ్రామ పంచాయతీ .
తేది:30-07-2016,ఆదివారం సమయం ఉదయం 10:00

ఈనాడు దినపత్రికలో "మంత్రాలు చేస్తున్నాడని ఓకరి హత్య"  అనే ఓ ప్రత్యేక కథనాన్ని చుాసి విషయాన్ని గోడిసెల స్వామి గారు  తేలియజేయటం జరిగింది.
వారు ఆ గ్రామంలో జరిగిన హత్య గురించి తెలుసుకోని చాలా  బాధపడినారు. అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు మంత్రాలు చేస్తున్నారాని హత్యలు చేయటం నేరం అని చేప్పి, ముఢానమ్మకాలపై అవగహణ కల్పించాలని మాకు   తెలియజేయడం జరిగింది. జోషి ప్రశాంత్ (తనుకు), రంగ ప్రశాంత్ (నేను), స్వట్కస్ (కరీంనగర్) SSF రాష్ట్రం కోఆర్టనేటర్ లు అక్కడికి వేళ్ళి సర్వే చేసి ,వారికి కోంత అవగహణ కల్పించాండి అని చేప్పుటం జరిగింది. జోషి ప్రశాంత్, స్వట్కస్ బేల్లంపల్లి రైల్వే స్టేషన్ రావటం జరిగింది.

అక్కడి నుండి మేము బస్సు ఏక్కి ఆసిఫాబాద్ 32 కీ,మీ వెళ్ళటం జరిగింది. మళ్ళీ అక్కడి నుండి కెరిమెరి మండలనికి (29కీ,,మీ) వేళ్ళుటం జరిగింది.

 సమయం:ఉదయం10అయింది,

కెరిమెరిలో దిగటం జరిగింది. అక్కడి నుండి
ప్రజలను చిన్నుగుాడకి ఏలా వెళ్ళాలి అని అడిగాము అప్పుడు సుాత్తన్ గుాడకి వేళ్ళి అక్కడి నుండి చిన్నుగుాడకి వెళ్ళాలి అన్నారు. కాని ఆ గుాడెంకి రవాణా సౌకర్యం లేదు, ఆటోలు గాని బస్సు వెళ్ళావు, ఇక్కడి నుండి ఐదు కీ'మీలు ఉంటుందాన్నారు, పైగా వరుసగా కురుస్తున్నా వర్షాల వల్లా మార్గం మెుత్తం బురదమయంగా ఉంటుందాని అన్నారు, అంతే కాకుండా దట్టమైన అడవి ప్రాంతాం నుండి వెళ్ళాలి అన్నారు, అప్పుడు ఏం చేయ్యాలో అర్థం కావటం లేదు , అయితే నడిచి వేళ్ళాక తప్పదు అని అర్థ మాయింది.
ముందు దుకాణంలో రేండు వాటర్ బాటిల్స్, 3బిస్కేట్ ప్యాకిట్స్ కోనుకోని చిన్నగుాడాకి బయలుదేరాము, వర్షం వచ్చేలా వాతవారణం చాలా చాల్లాగా ఉంది, అక్కడి గాలి ఏంతో ప్రశాంతాంగా ఉంది, అంటే ఇంచు మించు సునామి వచ్చేముందు వుండేలా అన్నామాటా.. ఇంకా నడుస్తునే ఉన్నాము.. 5నిమిషాల తరువాత పరుగేడుతున్నా సేరయేరు కనబడింది, మాకేంతో ఆనందంగా అని పించింది.. కోంచేం సేపు అక్కడ ఉండి గడిపి మళ్ళీ బయలుదేరాము. మనసుకి ఎంతో  ఆనందం కలిగింది. అడవితల్లి ఓడిలోకి వెళ్ళుతున్నాము. ఆ ప్రకృతిని, ఆ గాలిని ఆస్వాదిస్తూ ఇంకా వేగాంగా నడువసాగాను. మదిలో ఏన్నో ఆలోచనాలు మళ్ళీ అది అడవి ప్రాంత కుృార మృగల బారినా పడితే మా పరిస్థితి ఏంటో మళ్ళీ అసలు తిరిగి వస్తామా...? ముాఢా నమ్మకాల గురించి చేప్పినప్పుడు అక్కడి ప్రజలు తీరుగబడితే ఏంటీ మన పరిస్థితి అని ఆలోచిస్తునే ముందు సాగాం.? మదిలో ఎన్నో కష్టాల వర్షం..! 30నిమిషాలు అయింది. ఇంకా చిన్నుగుాడా రావాటం లేదు.. ఏంటి దారి తప్పుమ్మా.? అనే నిరాషాతో నడుస్తున్నాము చుట్టు అడివే కనబడుతుంది. నడువలేక 
పోతున్నాము. కాని ప్రయత్నిస్తున్నాము. దారిలో కోంత మంది కుాలీలు కనిపించారు, వారిని ఇంకా ఏంత దుారం అని అడిగాం. వారు మాకు బయపడుతుా సమాధానం ఇచ్చారు... చక్కగా వెళ్ళాలి సారు.. ఇంకా దుారం వేళ్ళాలి.. బేరగా వెళ్లండి అన్నారు.

ఇంకో 5 నిమిషాలు నడిచాము.. మేము వెతుకుతున్నా ఆ గ్రామ పెద్ద మనిషి (చేడం దేవరాజ్) ,ఇంకో ఇద్దరు కలిసి కాలినడకనా కెరిమెరిలోని వారానికి ఓక్కే రోజు అది ఆదివారం జరిగే సంతకి కుారగాయాలు కోనటానికి వెళ్ళాతున్నావారు, వారు మాకు ఏదురయ్యారు. మాలో ఓక్క తెలియని సంతోషం కల్పించింది. వారితో మాట్లాడి విషయాన్ని చెప్పి అక్కడి నుండి వారి గ్రామానికి తిసుకోని వెళ్ళారు వారు. చివరికి ఏంతో దుారం నడిచి మా గమ్యమును చేరుకున్నాము..

సమయం:12గంటల20నిమిషాలు.

మేము వారు ఉన్నా పరిసరాలు చుాసి చాలించుకపోయం. ఆ గ్రామం ఏర్పడి దాదాపు 120సంవత్సరాలు గడిచిపోయినా అక్కడ కేవలం 12 కుంటంబాలు మాత్రమే ఉన్నాయి. ముాడు తరాలుగా నుండి ప్రజలు జివిస్తున్నా వారికి చదువంటేనే తెలియదు, కేవలం జనాభా లేక్కలకోసం బ్రతుకుతన్నారు. అంతే మేము వివరాలు అడగటం ప్రారంభించాము.

వారుమాకు చేప్పిన సమచారం:-

మా ఊరిలో మగ-26, ఆడ-20, పిల్లలు-5 మంది ఉన్నారు సారు, కాని "అందులో నుండి ఐదుగురు మగ, ఇద్దరు ఆడ వారు జైలు శిక్ష పడి శిక్షను అనుభావిస్తున్నారని చేప్పరు". ముందే అసలు ప్రశ్న అడగాటం కన్నా కోన్ని వ్యక్తిగత ,ప్రభుత్వ సహుయం కోసం అడిగి తరువాత ముాఢనమ్మకాలపై చైతన్యపరాచాలను కున్నాము.

వారు కోలంస్ (ST) అనే గోండు తెగువకు చెందినావారు. వారు భీం అనే దేవున్ని (ఆకారం లేదు,
ఎలా ఉంటారో తేలియదు ) ప్రార్థిస్తారు. మా తండ్రికి మా తాత చేప్పారు. నాకు మా నాన్నా చేప్పరు సారు, మెుక్కుతున్నాము సారు అన్నారు వారు. వారికి ఏం తెలియదు కేవలం బ్రతుకుతున్నారు అంతే. స్వాతంత్రం వచ్చిన కుాడా వీరి బ్రతులు మారలేదు. వీరు కేవలం ఓట్ల కోసమే పుట్టారాని మాకనిపించింది. కాని వారి అజ్ఞానాన్ని చుాసి చాలా భాదపడినాము.. అసలు నిజాంగా ఇంకా ఇలాంటి మనుఘలున్నారా అనిపించింది. అప్పుడు మా అందరి మనస్సుల్లో పాలకుల నిర్లక్ష్యం వహించాటం వల్ల ఇంత నష్టం జరుగుతుందా.! అని అనుకున్నాము. మా ప్రశ్శలను మేము వేగవంతం చేశాము, వారు పుార్తిగా మాతో కలిసి చర్చలో పాల్లోన్నారు, వారి జీవనశైలిని తెలుసుకోవాటం జరిగింది. వారి "బ్రతుక భారం! జీవితం అంధకారం!!.. "వారి జీవనాధారం వ్యవసాయం మాత్రమే,
వారి పుర్వికుల నుండి వచ్చిన రెండు ఎకరాల భుామిలో కేవలం గోధుమ, పత్తి మాత్రమే పండిస్తున్నారు...
 ఇంతలో జోషి అడిగాడు.. ఏందుకు ఈ పంటలే పండిస్తున్నారు అని అడిగారు...? అప్పుడు వారు చేప్పినా సమాధానం సారు మేము నేర్చకున్నా పంట ఇదే, మా తాత ఈ పంటనే పండించేవారు అని సమాధానం చేప్పారు. ఇంతవరకు" వ్యవసాయశాఖ "వారు వీరి గ్రామానికి రాలేదాంటా అసలు అవగహణ కల్పించాలేదాంటా....! ఆ ప్రజలు గడకబియ్యం, రోటి, అప్పుడప్పుడు అన్నం తింటారు అంతే. ఇప్పుటి వరకు అక్కడ చదువుకున్నావారే లేరు. .చదువంటే తెలియదు మరి అంతే కాదు వారి ఆసుపత్రి లేదు, వైద్య సదుపాయం లేనే లేదు.  ఆ గ్రామంలో రుతుస్రావం తో మరణించిన  మహిళ ఎందరో ప్రాణాలు గాలిలో కలిసై రెండు, ముాడు రోజులు ఏడుస్తాం సారు అంతే మేము ఏం చేయాగాలం సారు అన్నారు.. ఇంకా వారిని మాట్లాల్లో పడేసి జరిగిన సంఘటను మెల్లగా అడగటం ప్రారంభించాం..
అప్పుడు జైలుకైల్లినా వారిని విడిపించాలేదా.....? 
అని అడిగాను వారు అమాయకంగా డబ్బులుంటేనే వారి బేల్ వస్తుందన్నారు... అసలేం జరిగింది అని అడిగాము. ఆ గ్రామ పెద్ద మనిషి (చేడం దేవరాజ్) తడబడుతు జరిగిన యాదర్థం గాధ చేప్పటం ప్రారంభించారు...

తేది:-06 - జుాన్-2016,సోమవారం,
సమయం:-సాయంత్రం 4గంటలు..

మానవ సమాజం తలదించుకునేలా ఓకరి హత్య జరిగింది.. కారణం మంత్రాలు చేస్తున్నాడని ఆ గ్రామనికి చెందిన కుడిమేత పోసిగా(38)ను తరిమి, తరిమి కోట్టి చంపిన ఘటనతో లోకం దద్దరిల్లింది. ఇంకా వివరాలకి వెళ్ళితే ఆ రోజున గ్రామంలో విదర్ హితుార్ (వారి సంప్రదాయ పండుగ ) చేశారు. ఆ సమయంలో పోసిగా ఇంట్లోకి పాము వచ్చింది. కోడిని కాటేయడంతో కోడి చనిపోయింది. దీంతో పాముని చంపేసి పాము, కోడిని గోయ్యి తవ్వి పుాడ్చేశాడు అనంతరం  ఎప్పుడో వేసిన పాత చేతి పంపువద్ద నీటితో  కడుక్కున్నాడు. తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని, పాము, కోడితో ఏదో మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఆగ్రహించిన కోంతమంది కర్రలు, రాళ్లతో కోట్టి సోమారం రాత్రి చంపేశారు. చివరికి అంతా అయిపోయింది.  చివరికి పోసిగా మరణించాడు. మానవత్వం అనే పదానికి అర్థం తెలియని వారు, మనుషులనే పదాన్నే మర్చిపోయి పశువుల ప్రవర్తించారు,  మరణించిన అతనికి భార్య అయ్యుాబాయి ఇద్దరు కోడుకులు  పెద్దభీం(8) ,చిన్నభీం(3), ఓక కుాతురు రాజేశ్వరి(5) ఉన్నారు. చివరికి వారు అనాధలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు  మంగళవారం ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. కోలాం ఆచార సంప్రదాయ ప్రకారం విదర్ హితుార్ ప్రత్యేక పుాజలు చేసినప్పుడు గ్రామంలో ఉన్నవారందరుా పుాజ చేసే ప్రదేశంలోనే ఉండాలి. ఇతర పనులు చేయకుాడదు. కనీసం చేతిపంపు నీరు కుాడా తాగరాదు. ఇలాంటి కట్టుబాట్లకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడంటుా పోసిగాను హత్య చేశారు. 

  మా దర్యాప్తు అనంతరం  జరిగిన విషయాన్ని మేము గ్రామస్తులకు  తెలియజేయడం జరిగింది. విషయం తెలుసుకున్న అంత పశ్చాత్తాపండ్డారు.  ఓ పక్క  ఒక కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది,  మరోపక్క  ఏడుగురు ఇంటి జైలు జీవితాన్ని  గడుపుతూ ఆ గూడెం చిన్నబోయింది..  
ఇది అవగాహన లోపమా...?  ప్రభుత్వాల నిర్లక్ష్యంమా..? 
 ఆ గ్రామానికి కేవలం ప్రజాప్రతినిధులు ఎన్నికలకు రెండు రోజుల ముందు వచ్చి   కేవలం 20  లేదా 50 రూపాయలు , ఒక సీసా సార  ఇచ్చి ఎన్నికలలో ఓటు వేయించుకుంటారు.
 మా ప్రభుత్వాల వల్ల రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ ప్రజాప్రతినిధి లారా ఇది చూసి సిగ్గు పడకండి,, ఇంకా ఆసుపత్రి  సౌకర్యాలు లేని గ్రామాలు,  పాఠశాలలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించని మీరు ఉన్నా ఒకటే నీ ప్రభుత్వాలు లేకున్నా ఒకటే.....
-మీ రంగ ప్రశాంత్,  సామాజిక కార్యకర్త
 (మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత)
























అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో పీజీ వుడ్ సైన్స్ కోర్స్ లో ఉచితంగా సీటు సాధించిన సుహర్ష ని సన్మానం చేసిన ఎర్రోళ్ల నరేష్


అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో పీజీ వుడ్  సైన్స్ కోర్స్ లో  ఉచితంగా సీటు సాధించిన సుహర్ష ని సన్మానం చేసిన ఎర్రోళ్ల నరేష్  

విద్యార్ధి సుహర్షని సన్మానం చేసిన ఎర్రోళ్ల నరేష్  
    మేము సైతం : సింగరేణి కార్మిక బిడ్డల సంఘం(SKBS) ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగి భాస్కర్ల శ్రీనివాస్ కుమార్తె సుహర్ష తెలంగాణ ఫారెస్ట్ ఇనిస్టిట్యూట్ లో డిగ్రీ పూర్తి చేసి, అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో పీజీ వుడ్  సైన్స్ కోర్స్ సుమారు 50 లక్షల సీటు ఉచితంగా సాధించినందుకు సింగరేణి కార్మిక బిడ్డల సంఘం తరుపున శాలువతో సన్మానం చేసి, పూల మొక్క అందజేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల నరేష్ మాట్లాడుతూ సింగరేణి ముద్దు బిడ్డ,సుహర్ష అమెరికాలోని  పీజీ వుడ్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ లో సీటు సాధించడం చాలా గొప్ప విషయమని, తెలంగాణ రాష్ట్రం లోని విద్యార్థులందరు సుహర్ష ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని భవిష్యత్ లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరడం జరిగింది. మరియు సుహర్ష మాట్లాడుతూ నాకు సన్మానం చేసిన నాయకులకు సింగరేణి కార్మిక బిడ్డల సంఘం(SKBS)నికి ప్రత్యేక ధన్యవాదాలు, భవిష్యత్ లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల నరేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి పడాల రవీందర్, తెలంగాణ జాగృతి యువజన నాయకులు కందుల ప్రశాంత్, అడ్వకేట్ మెరుగు నరేందర్, సుహర్ష కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.