- అశోకుడు యుద్ధం వీడిన రోజే దసరా విజయదశమి చరిత్ర పరిశీలించాలి - దుర్గం సిద్ధార్థరాంమ్మూర్తీ సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
![]() |
| మాట్లడుతుాన్న, దళిత, బహుజన నాయకులు |
బుద్ధం సరణం గచ్ఛామి
ధమ్మం సరణం గచ్ఛామి
సంఘం సరణం గచ్ఛామి
1. భారతదేశ చరిత్ర అంటే బ్రహ్మనిజానికి, బౌద్ధం కి మధ్య సంఘర్షణ మాత్రమె అంటారు బాబాసాహెబ్. చరిత్ర వేటగాళ్లువ్రాసుకున్నదే కాని పులులు వ్రాసుకోలేదు అయితే వేటగాళ్ళ కుట్రలను ఇప్పుడు తెలుసుకున్న బహుజన సమాజం సమర్థవంతంగా త్రిప్పికొడుతుంది.
2. దష్+హరా =దశరా అంటే 10 ని కూల్చడం .మరి ఆ పది ఏంటిది అని చుస్తే మనకు మౌర్య సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది.మౌర్య వంశం మొదటి రాజు చంద్రగుప్తుడు మొదలు చివరి రాజు బృహదత్తుడు వరకు పది వంశాల పాలన .ఈ పది వంశాల పాలన బౌద్ధ శాసన కాలం, అంతే కాకుండా మౌర్య సమ్రాజ్య చివరి రాజు బృహదత్తు ని సైన్యాధ్యక్షుడు గా కుట్ర తో చేరిన పుష్యమిత్రశృంగ అనే బ్రాహ్మణుడు చంపడం జరుగుతుంది. మౌర్య రాజ్యాన్ని కూల్చి తన బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించించడం జరిగింది.ఒకొక్క బౌద్ద భిక్షువు తల ను నరికి తెచ్చిన వారికి నూరు వరహాలు ప్రకటించింది ఈ క్రూరుడే.
3. బౌద్ద కాలo అయినా మౌర్యుల కాలంలో బ్రాహ్మణుల ను ఎవరు పట్టించుకోలేదు.వారికీ ఎటువంటి గుర్తింపు, అది శ్రమజీవుల గుర్తిoపు కాలం ముఖ్యన్గా శ్రద్ద ఖర్మలు ఆగిపోయాయి.దానితో శృంగ బ్రాహ్మణుల కు గడ్డుకాలం దాపురించింది.దానితో కుట్ర చేసి బృహదత్తునికి పిల్లను ఇచ్చి పెళ్లి చేసి చివరికి ఈమౌర్య పదవ రాజు ను హత్య చేసి మౌర్య సామ్రాజాన్ని కూల్చడానికి గుర్తే ఈ దష్-హరా.
4. అశోక విజయ దశమి చరిత్ర ను వక్రేకరించిన బ్రహ్మనిజం. ది గ్రేట్ అశోక మౌర్య కళింగ యుద్దాన్ని గెలిచి సామ్రాట్ గా ప్రకటింపబడుతారు.ఆ తరువాత ఆయన బౌద్ద భిక్షువు మొగలి పుత్త తిస్స దగ్గరికి వెళ్లి నేను ఇప్పుడు సామ్రాట్ నుఅయ్యాను అని చెబుతారు.అపుడు ఆ బౌద్ద గురువు ఇచ్చిన జ్ఞాన బోధ ఆయనను ఆలోచింప జేస్తుంది.కళింగ యుద్ధాన్ని వెనక్కు మరలి చూసుకున్న అశోకుడు కి లక్షలాది సైనికుల శవాల దిబ్బలు,ఏరులై పారుతున్న రక్తం,తెగిపడ్డ మానవ* శరీరాలు ,భర్తలు,బిడ్డలను కోల్పోయిన అడబిడ్డల ఆర్తనాదాలుకనిపిస్తాయి.చలించి పోయిన మౌర్యరాజు పశ్చాత్తాపం చెంది చనిపోయిన కళింగుల కుటుంబాలకు పెద్దకొడుకు అయిపోతాడు.
5. యుద్ధం జరిగిన తరువాత మామూలుగా విజయోత్సవ సభ జరగాలి .కాని అశోకుడు యుద్ధం జరిగిన పది రోజులకు సరిగ్గా దశమి రోజున బౌద్ద ధమ్మ దీక్ష ను బౌద్ద గురువు మొగలి పుత్త తిస్స ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది.ఈ దశమీ రోజున అశోకుడు బుద్ధుని పాదాల దగ్గర ఆయుధాలనుపెట్టడం జరిగింది. మౌర్యరాజు బుద్దుని పాదాల వద్ద ఆయుధాలుపెట్టి విజయ దశమి నిర్వహిస్తే బ్రహ్మనిజo ఇదే రోజు ఆయుదాలకు రక్తం పూసి హింస ను ప్రేరేపించేల ఉన్న ఒక స్త్రీ ప్రతిమ ముందు పూజలు చేస్తారు.శాంతి ని బోధస్తున్న బౌద్దo కి వ్యతిరేకoగా బ్రాహ్మనిజం చేస్తున్నదే ఈ విజయ దశమి.
6. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుండి భారత దేశం లో బౌద్ధం మొదలై క్రీస్తు శకం 15 వ శతాబ్దంవరకుసుమారు 2 వేల ఏండ్లు బౌద్ధం విలసిల్లింది.బ్రహ్మనిజ కుట్రలకు పూర్తిగా ఈ దేశం లో బాబా సాహెబ్ కి ముందువరకు బౌద్ధం తుడుచుకుపెట్టుక పోయింది. నలంద ,నాగార్జున,తక్షషీలా ,విక్రమషీలా లాంటి విశ్వ విద్యాలయాలతో చదువును,జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన బౌద్ధ కాలం,బ్రహ్మనీయా ద్వంస కుట్రల వలన ఈ దేశం మూఢత్వం,అవిద్య లో మొదటి స్థానం లోకి వచింది.
7. హిందువుగా పుట్టాను కాని హిందువుగా మరణించను అని ప్రకటించిన డాక్టర్ అంబేద్కర్ గారు 20ఏళ్ళ మన చరిత్ర వెలికి తీత అనంతరం సరిగా అశోకుడు బౌద్ధ దమ్మ దీక్ష తీసుకున్న "దశమి"నాడు 1956 లో బౌద్ధధమ్మ దీక్షను 5 లక్షల మంది తో బౌద్ద గురువు చంద్రమని గారిఆధ్వర్యంలో స్వీకరించడం జరిగింది.అంతే కాకుండ మరునాడు బాబాసాహెబ్ స్వయంగా మరో 2 లక్షల ప్రజలకు బౌద్ద దీక్ష ను ఇవ్వడంజరిగింది.
8. పుష్యమిత్రశృంగు ని తరువాత కుల వ్యవస్త పాదుకుపోయింది. బౌద్ధo లో ఉన్న వారిని అంటరాని వారుగా చేసిన బ్రాహ్మనిజం.అందులో నాగవంశీయులు కూడా అంటరాని వారు అయ్యారని బాబాసాహెబ్ చరిత్ర విశ్లేషించడం జరిగింది.
9. దసరా ను జరుపుకుoటున్న అంటరాని కులాలు అవివేకులు, చరిత్ర తెలియని వారే అని చెప్పాలి.విజయదశమి అదే అశోక విజయ దశమి రోజు బాబా సాహెబ్ బౌద్ధం స్వీకరించిన నాగపూర్ ను సందర్శించడం విదిగా పెట్టుకుందాం .బాబా సాహెబ్ ఆకాంక్ష అయినా ప్రబుద్ధ భారత్ నిర్మిద్దాం.
10. రామాయణం పేరుతొ ఒక కల్పిత గాథ ను అల్లిన బ్రహ్మనిజo, పుష్యమిత్ర శృంగున్ని రాముడు క్యారెక్టర్ గా, బృహదత్తు న్ని 10 తలలు ఉన్న రావణా సురుడుగా ఒక కథను సృష్టించారు. ఇక్కడ 10 తలలు అంటే 10 మౌర్య బౌద్ద శాశన కాలాలు అని గ్రహించండి . మన రాజుల చంపి మనతో పండగ చేయిస్తున్న బ్రాహ్మణ కుట్రల చేదిస్తూ రావణ వధను తీవ్రoగా ప్రతిఘటిద్దాం.
దసరాను అశోక విజయ దశమి జరుపుకుందాం ఈ కార్యక్రమంలో దుర్గం గోపల్ తెలంగాణ నేతాకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు,హన్మాండ్ల శ్యామ్ భారత నాస్తిక సమాజం రాష్ట్ర కోశాధికారి,దాగం మల్లేష్ DHPS, రంగ ప్రశాంత్ పెరియర్ ఆలోచన వేదిక సభ్యులు, సపాట్ మల్లేష్.బా.నా.స జిల్లా నాయకులు దాగం రాయలింగు అంబేద్కర్ సంఘం మండల కార్యదర్శి పాల్గొన్నారు














