Thursday, November 21, 2019

బెల్లంపల్లిలో ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారి జన్మదినోత్సవ వేడుకలు

బెల్లంపల్లిలో ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారి జన్మదినోత్సవ వేడుకలు

  •   ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్రావు జన్మదినోత్సవ వేడుకలు
  • NSUI జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు 
  • ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి, పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ పంపీణీ చేసిన నాయకులు


ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్రావు గారి 56 జన్మదినసందర్భంగా NSUI జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో  బెల్లంపల్లి బస్తి గవర్నమెంట్ పాఠశాలలో కేక్ కట్ చేసి, పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే అయన మాట్లాడుతూ పిల్లలు చదువులోను  మరియు ఆటలలో ముందుఉండాలని చెప్పడం జరిగింది. సురేఖ మేడం గారు యువతను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహిస్తున్నారు, వారు రఘుపతి రావు ట్రస్టు ద్వారా మంచిర్యాల జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు, వారు రానున్న రోజుల్లో అనేక పదవులు పొందాలని అన్నారు. కార్యక్రములో  మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య,మాజీ కౌన్సిలర్ చింతపండు శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎనగందుల వెంకటేష్  కాంగ్రెస్  నాయకులు ఆకాష్, జమ్మికుంట విజయ్, బెల్లంపల్లి NSUI మండల్ ప్రెసిడెంట్ కాంపెల్లి పవన్, వైస్ ప్రెసిడెంట్ సాయి, తాండూర్ NSUI మండల్ ప్రెసిడెంట్ కొయ్యడ రవి, ప్రదీప్  తదితరులు పాల్గొన్నారు
                                                                

Sunday, November 3, 2019

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్- చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్- చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.

  రైతుల పంట పోలలను పరీశీలిస్తున్నా నాయకులు                              
 ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామాన్ని  కాంపెల్లి ఉదయ్ కాంత్ - టీపీసీసీ, లీగల్ సేల్  వైస్ చైర్మన్  మరియు కారుకూరి రాంచందర్ MPTC (మాజీ ZPTC)  సందర్శించడం జరిగింది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను వారి కుటుంబాలను పరామర్శించి పంట పోలలను పరిశీలించాడం జరిగింది. నాయకులు ఓట్ల సమయంలో వచ్చి ఓట్లు వేఎంచు కోని వెళ్ళడం తప ఇటువంటి సమయంలో మమ్మల్ని పటించు కోవడం లేదని ప్రజలు వాపోయారు. ఈ సందర్భంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు మాట్లడుతుా ఇటివల కురిసిన అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. పట్టా లేకున్నా కాస్తులో పేరున్న రైతులకు మరియు పంటకు ఇన్సూరెన్స్ లేని రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  రైతుల సమస్యలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా చోద్యం చుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉదయ్ కాంత్ గారు. వేంటనే జిల్లా కలెకర్టర్ గారు స్వందించి అధికారులకు ఆదేశాలు పంపించాలని అన్నారు. సంబంధిత వ్యవసాయాశాఖ అధికారులకు పోన్ చేసి నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని, రైతుల ఆవేదనాని అధికారులకు వివరించారు. వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాతామని హామి ఇవ్వటం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాజ్ కుామార్, విజయ్ కుమార్,జాడి మహేష్, బండి మల్లేష్, ఉప సర్పంచ్ అనవేని స్వప్న వార్డ్ సభ్యులు మంజుల మహేశ్వరి సుమలత ప్రదీప్, శేఖర్ మరియు రైతులు పాల్లోన్నారు.