Sunday, November 3, 2019

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్- చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్- చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.

  రైతుల పంట పోలలను పరీశీలిస్తున్నా నాయకులు                              
 ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామాన్ని  కాంపెల్లి ఉదయ్ కాంత్ - టీపీసీసీ, లీగల్ సేల్  వైస్ చైర్మన్  మరియు కారుకూరి రాంచందర్ MPTC (మాజీ ZPTC)  సందర్శించడం జరిగింది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను వారి కుటుంబాలను పరామర్శించి పంట పోలలను పరిశీలించాడం జరిగింది. నాయకులు ఓట్ల సమయంలో వచ్చి ఓట్లు వేఎంచు కోని వెళ్ళడం తప ఇటువంటి సమయంలో మమ్మల్ని పటించు కోవడం లేదని ప్రజలు వాపోయారు. ఈ సందర్భంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు మాట్లడుతుా ఇటివల కురిసిన అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. పట్టా లేకున్నా కాస్తులో పేరున్న రైతులకు మరియు పంటకు ఇన్సూరెన్స్ లేని రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  రైతుల సమస్యలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా చోద్యం చుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉదయ్ కాంత్ గారు. వేంటనే జిల్లా కలెకర్టర్ గారు స్వందించి అధికారులకు ఆదేశాలు పంపించాలని అన్నారు. సంబంధిత వ్యవసాయాశాఖ అధికారులకు పోన్ చేసి నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని, రైతుల ఆవేదనాని అధికారులకు వివరించారు. వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాతామని హామి ఇవ్వటం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాజ్ కుామార్, విజయ్ కుమార్,జాడి మహేష్, బండి మల్లేష్, ఉప సర్పంచ్ అనవేని స్వప్న వార్డ్ సభ్యులు మంజుల మహేశ్వరి సుమలత ప్రదీప్, శేఖర్ మరియు రైతులు పాల్లోన్నారు.















No comments:

Post a Comment