Friday, October 4, 2019

అంకుశం గ్రామ ప్రజల ప్రధాన సమస్యలు పరిష్యారించాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్ చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.       

అంకుశం గ్రామ ప్రజల ప్రధాన సమస్యలు పరిష్యారించాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్ చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఐ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.       
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలంలోని 
అంకుశం గ్రామ పంచాయతీని పర్యటించిన కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు అక్కడి ప్రజల ప్రధాన సమస్యలు పరిష్యారించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. 30 రోజుల ప్రణాళికలో ఏమేమి పనులు జరిగాయో పరిశీలించారు. అంకుశం గ్రామంలోని వాడ వాడకి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై గ్రామ సర్పంచ్ తో చర్చించాటం జరిగింది.
 అనంతరం అంగవాడి కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ మాట్లాడుతుా గ్రామలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్ముని మాటలు ప్రభుత్వం విస్మరించి కేవలం ఓట్ల కోసమే పాలన అనే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన  ఉందని అన్నారు. ఏన్నికల ముందు గ్రామలలో అరకోర సాదుపాయలు కల్పించి, ఏన్నికలలో గెలిచిన తరువాత గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.. ప్రధాన రహదారి నుండి గ్రామంలోకి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అదే విధంగా అనారోగ్యనికి గురైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే చాలా కష్టతరంగా ఉందాని, గర్భిణీ స్త్రీలు ప్రసవించిన ఆనంతరం పాప, బాబు పుట్టారనే సంతోషం ఉన్న, చికిత్స అనంతరం ఊళ్లోకి రావాలంటే రోడ్డని చుాసి భయపడే పరిస్థితి ఉందని అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ అమలు చేస్తామని ఎన్నికల ముందు హామి ఇచ్చి, మరిచిపోవటమే కాక అంకుశం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకి చెరిన సంబంధిత  అధికారులు పట్టించు కోవటంలేదాని అన్నారు. వెంటనే పక్కా భవనాన్ని నిర్మించి, వచ్చే విద్యా సంవత్సరానికి నూతన భవనాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా  రైతులకు అందని ద్రాక్షలాగా రైతు బంధు పథకం ఉందాని, ఎన్నికల ముందు రైతులకు ఇవ్వవలసిన రైతు బంధు డబ్బులను భుాస్వాములకి, వందల ఏకరలు ఉన్న ఆసాములకి రైతు బంధు పథకం పేరిట కోట్లల్లో రుాపాయలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియెాగంచేశారని, ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవాని, ప్రపంచా బ్యాంక్ కుాడ తెలంగాణకి అప్పులు ఇవ్వలేమని చెప్పిందాని అన్నారు. నిరుపేద రైతులు రైతు బంధు డబ్బులకై బ్యాంక్ ల చుట్టుా తిరుగే పరిస్థితి వచ్చిందాని, రైతు బంధు డబ్బులకై ఆన్ లైన్ లో చుాసే ట్రెజరీలో పెండింగ్ అయినట్టు ముాడు నెలలుగా చూపిస్తుందనాని, ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి, మభ్యపెడుతున్నారని అన్నారు.. అంగన్వాడీ కార్యకర్తలకు గత రెండు నెలలుగా జీతభత్యాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వేంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంకుశం గ్రామ ఉపసర్పంచ్ కోప్పుల భానుచంగర్, కాంగ్రేస్ నాయకులు  సంకురి శంకర్, ప్రదీప్ తదితరులు మరియు అంకుశం గ్రామస్థులు ఉన్నారు.




                                                                           

No comments:

Post a Comment