Tuesday, January 29, 2019

ఎద్దు మాంసం

రచయిత : గోడిసెల శ్రీహరి, ( డా,, బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహిత )
ఎద్దు మాంసం
----------------------
రామాయణాన్ని చదువు 
యజ్ఞం. యాగాలు చేస్తూ 
పశువుల చంపి మాంసం 
తిన్నది బ్రాహ్మణులు కాదా !
వసిష్ఠుడు గో మాంసం 
వండి విందు భోజనానికి 
రాముణ్ణి అవ్వణించలేదా. 

నీతి మాటలు చెప్పుతుండ్లు నేటి 
వారి వారసులు 
తాము శాకాహారులమని 
శాకాహారమిచ్చు చెట్లు కూడా జీవులేనన్నది 
వారికీ తెలియదా !

చరిత్ర తెలియనోళ్లు 
గోమాంసం తిన్నారని 
ముస్లిం. దళితులపై 
దాడులు చేస్తూ 
మారణకాండ చేస్తూండ్లు 

ఆకలి తీర్చుకోవడానికి 
చచ్చిపోయిన ఎద్దు 
మాంసంతిని వాటి 
తోళ్లతో చెప్పులు చేసి 
సమాజానికిచ్చింది మాదిగన్నాకదా !

చచ్చిపోయిన పశువుల 
చర్మాలను ఒలిచి 
డప్పుగా చేసి సంగీతాన్ని 
సృష్టించింది మాదిగన్నాకదా !

జ్ఞానం ఈ దేశపు మూలవాసులదైతే 
కుతంత్రాలతో జ్ఞానాన్ని 
సొంతం చేసుకున్నది బ్రాహ్మణులుకదా !

ఎద్దు మాంసం తిన్న 
దేశాలు శాస్త్ర సాంకేతిక 
రంగాలలో ముందుంటే 
ముప్ఫైయారు కోట్ల 
దేవులున్న మనదేశం 
ఎందుకని వెనుకబడి వుందో చెప్పగలరా 
హిందూ మతవాదులు.

1 comment: