Tuesday, January 29, 2019

హిందు_మతొన్మాద_వ్యతిరేక_దినం

    
   - రచయిత :నరేష్_గ్యార_ఓయూ    
హిందు_మతొన్మాద_వ్యతిరేక_దినం

ప్రజాస్వామ్యంలొ ప్రజల ఆమెదం పొందడానికి,ప్రజా అవసరాలను గుర్తించడానికి ప్రజా జీవన విదానంలొ మార్పులు తేవడానికి చర్చలు సంప్రదింపులు సైద్దాంతికరణలొ మూలం వాటి ద్వార మాత్రమే సామాజిక, ఆర్ధిక ,రాజకియ, న్యాయం సాద్యమవుతుంది కాని భరత దేశంలొ హిందు మతొన్మాద శక్తులు దినికి వ్యతిరేకంగా...!!

హింసా బెదిరించడం ప్రజాస్వామ్యా వాదుల్ని హత్య చెయడం చేస్తు ...చర్చ అనే అంశమే తెర పైకి రాకుండా ప్రజాస్వామ్యన్ని బ్రతకనివ్వకుండా హిందు మతొన్మాదమే ఈ దేశంలొ ఉండాలనే నిరంకుశవాదన్ని అరచకత్వన్ని వేల సంవత్సరాల నుండి అవలంబిస్తు వస్తున్నారు...!!

ఎంతటి ప్రతికూల సామజిక పరిస్థితుల్లోనూ ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా వాస్తవాలను గుర్తించి కఠొర సత్యాలను వెతికి శోధించి కుండబద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్లు ప్రాణాలను సైతం తెగించి , రాజీపడక తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించిన మహానుభావులు కోకోల్లలున్నారు...!!

తత్వాలను, తత్వాలతో , భావాలను,భావాలతో, ఓడించలేని పలాయన తిరోగమ నివాదులు. తమ ప్రత్యర్థుల విరుద్ధ భావజాలాలకు చెందిన వ్యక్తులను , సమూహాలను ,నేరుగా ఓడించలేక కుట్రలతో , కుహకాలతో , చాణక్యనీతితో , మనుధర్మ పరిరక్షణలతో , ఈ దేశంలో వెలది ‘భవిష్యత్ వేగుచుక్కలు , హత్యలుచేసి ,చిత్రహింసలు చేసి , ఉచకోతలు , నరసంహారాలు జరిపిన ఘటనలు చరిత్ర పూతల నిండా నమోదైనవి....!!

మానవులందరూ ఒక్కటే ఈశ్వరుడొక్కడే , సత్యమొక్కటే అంతిమ సత్యం మిగిలిన ధర్మాలు , దేవతలు ,పురాణాలన్నీ అసత్యమేనని చెప్పడం సహితం ఓర్చుకోలేని హిందుత్వ శక్తులు , చివరకి మూఢనమ్మకాలు నిర్ములించాలని చెప్పడం కూడా నేరంగా పరిగణించి , బెదిరింపులకు , దాడులకు ,హత్యలకు ,నరమేధాలకు ఎన్నాళ్ళనుంచో పూనుకుంటూనే ఉన్నారు...అందులో కొత్తేమి లేదు అందులో భాగంగానే #గాంధీని ఆపైన డాబోల్కర్, పన్సారి,ని కాల్బుర్గిని, గౌరీ లంకేశ్, లను దారుణంగా హత్యచేసి ...ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నారు ....!!

స్వేచ్ఛ సమానత్వం పై మాట్లాడినందుకు , హిందుత్వ మతోన్మాదాన్ని వ్యతిరేకించి ముడానమ్మకాలను, అబద్దాలను,తృణిగించి,హేతుబద్దతను, శాస్త్రీయతను, సామజిక,సమానత్వాన్ని, వ్యక్తపరిచందుకు డాబోల్కర్,కాల్బుర్గిని, అత్యంత దారుణంగా ఒకే పద్దతిలో హత్యచేశారు...అదే క్రమంలో ఇటీవల జర్నలిస్ట్ #గౌరీ_లంకేశ్ ను కూడా హత్య చేసి ప్రజాస్వామ్య గొంతులకు ప్రమాదకర హెచ్చరికలు జారీచేశారు ..!!

అదే క్రమంలో గోరక్షదళాల పేరుతొ సామాన్యులపై పాశవికంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తూ.. ఘర్ వాపాసి పేరుతొ భారతీయత దేశభక్తి పేరుతొ..హిందూమతోన్మాదాని వ్యతిరేకించిన వారందరిని వరుసపెట్టి మరి హత్యలు చేస్తూ...అడిగితె చంపేస్తాం అనే ఓ బయేత్పతాన్ని స్పష్టించారు ..!!

ఇలాంటి బయేత్పత హత్యారాజకీయాల వాతావరణంలో ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ...ప్రజాసంఘాలు మేధావులు రచయితలూ రాజకీయ నాయకులూ , విద్యార్థి సంఘాలు అందరు ఐక్యంగా పోరాడాలి అల పొరడాని క్రమంలో...భవిషత్ తారలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయి అరాచకం హింస హత్యల రాజ్యమేలే పరిస్థితి దారితీస్తుంది ..కాబట్టి #జనవరి_30 ని హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా పాటించి ..ప్రజాస్వామ్యాన్ని రక్షించే గొంతులను ఏకం చేసి పోరాడుదాం ...!!

                         - నరేష్_గ్యార_ఓయూ

No comments:

Post a Comment