Monday, January 28, 2019

అగ్రవర్ణాలకు, బ్రాహ్మణులకే భారతరత్న అవార్డులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన - ఒవైసీ

అగ్రవర్ణాలకు, బ్రాహ్మణులకే భారతరత్న అవార్డులు తప్పని పరిస్థితుల్లో అంబేద్కర్‌కు కూడా భారతరత్న ఇచ్చారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన   : ఓవైసీ  

ముంబై : భారత అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ను ఇప్పటి వరకు ఎంతమంది ముస్లింలు, దళితులు, ఆదివాసీలకు ఇచ్చారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. దళితుల ఐకాన్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు కూడా భారతరత్న అవార్డును హృదయపూర్వకంగా ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహారాష్ట్రలో ఓ సభలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారో చెప్పాలని ఒవైసీ కేంద్రాన్ని నిలదీశారు. తప్పని పరిస్థితుల్లో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డును ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత రత్న అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అత్యున్నత పురస్కారాల ప్రకటన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి......    

No comments:

Post a Comment